వెంకటేష్, నాగ చైతన్య ప్రధాన పాత్రలలో రూపొందనున్న చిత్రం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మల్టీ స్టారర్కి వెంకీ మామ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు పాపులర్ రైటర్ కోన వెంకట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ .. వరుణ్ తేజ్తో కలిసి అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు. మరో వైపు చైతూ నటించిన సవ్యసాచి నవంబర్ 2న విడుదల కానుంది. దీంతో ఇద్దరు హీరోలకి డిసెంబర్ నుండి కొంత ఫ్రీ టైం దొరకనుంది.