Saturday, May 18, 2024
- Advertisement -

సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న వెంకీ

- Advertisement -

సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ గురు సినిమా త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నుండి మ‌రో సినిమా రాలేదు.దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.తాజాగా వెంకీ రెండు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ స్టార్ట్ చేశాడు.నాగ‌చైత‌న్య‌తో బాబి ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ మామ అనే సినిమా చేస్తున్నాడు.దీనితో పాటు వ‌రుణ్ తేజ్‌తో ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు.ఇక వెంకీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఈ రోజుతో 32 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.

తన సినీ ప్రయాణం గురించి చెబుతూ.. ‘1986 ఆగస్టు 14న నేను నటుడిగా జన్మించాను. నేను తొలిసారి నడిచిన ‘కలియుగ పాండవులు’ సినిమా విడుదలై ఈరోజు 32 ఏళ్లు అవుతుంది.త్వరలోనే మీకో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాను’ అంటూ రాసుకొచ్చాడు వెంకీ.ఇంతకీ ఆయన ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్‌ ఏంటా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడిగా మీరు మరింత ఎదగాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -