Sunday, April 28, 2024
- Advertisement -

యంగ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ రొమాన్స్..

- Advertisement -

గీత గోవిందం దర్శకుడు పరశురామ్, హీరో విజయ్ దేవరకొండ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నట్లు ఇటీవలి వరకు వార్తలు వచ్చాయి.

కాని తాజాగా ఈసినిమాలో పూజా హెగ్డే కాదని, విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా నటించడానికి సీతా రామం నటి మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. త్వరలో టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనంది.

గౌతమ్ తిన్ననూరి యొక్క కాప్ యాక్షన్ డ్రామాను విజయ్ ముగించిన తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. విజయ్ ప్రస్తుతం కుషి సినిమాలో సమంతతో కలిసి నటిస్తున్నాడు. మరోవైపు మృణాల్ ఠాకూర్ నాని 30వ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -