Wednesday, May 15, 2024
- Advertisement -

మొదటి అడుగు లో నే ‘బాంబ్’ పేల్చిన రష్మిక

- Advertisement -

మొదట్లో అందరూ పుకారు అని భావించినా చివరికి రష్మిక తమిళ సినిమా అరంగేట్రం ఖరారైందని అధికారిక ప్రకటన రావడం తో అందరూ సంతోషించారు. ఇప్పుడు రష్మిక త్వరలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. లోకేష్ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లు. ఒకళ్ళు రాశి ఖన్నా కాగా మరొక హీరోయిన్ రష్మిక. అయితే ఈ సినిమా కోసం రష్మిక కి భారీ ఎత్తున పారితోషికం ఇవ్వనున్నారు నిర్మాతలు. నిజానికి రష్మిక రాశి ఖన్నా కన్నా జూనియర్. కానీ రాశి ఖన్నా క్రేజ్ ని మార్కెట్ ని రష్మిక ఎప్పుడో దాటేసింది. అందుకే ఇప్పుడు రాశి కన్నా రష్మిక కె ఎక్కువ డిమాండ్. అందుకే రష్మిక కి కూడా దాదాపు పెద్ద మొత్తం పారితోషికం గా ఇచ్చారు.

అయితే ముందు రష్మిక ఈ సినిమా వదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఈ సినిమా దర్శక నిర్మాతలు రష్మిక కావాలని అని పట్టుబట్టడం తో ఎక్కువ పారితోషికం ఇస్తామని ఆఫర్ చేయడం తో, రష్మిక వెంటనే తన డేట్స్ అడ్జెస్ట్ చేసి ఈ సినిమా ని సైన్ చేసింది. దాదాపుగా కోటి – కోటిన్నర మధ్యలో తనకి ఒక అమౌంట్ ని నిర్మాతలు పారితోషికం గా ఫిక్స్ చేశారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -