Monday, April 29, 2024
- Advertisement -

మహేష్ కోసం పలువురు దర్శకులు!

- Advertisement -

ఇష్క్, మనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు విక్రామ్ కుమార్. ప్రస్తుతం సూర్యతో 24 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే టాలీవుడు లో టాప్ హిరోలంతా ఇప్పుడు ఈ దర్శకుడితో చెయడానికి ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నాడు.

ఒక పక్క సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ మరో పక్క తదుపరి సినిమాల పట్ల పక్క ప్లానింగ్ చేసుకుంటున్నాడు. మహేష్ కోసం పలువురు దర్శకులు క్యూ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ కమర్షియల్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో తెలుగు తమిళ బాషలలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మనం ఫేమ్ దర్శకుడు విక్రం కుమార్ ఇటీవలే మహేష్ ని కలిసి ఓ వండర్ ఫుల్ కథ చెప్పాడట.

దీనికి మహేష్ ఇంప్రెస్స్ అయ్యి కథ చాలా బాగుందని చెప్పి వెంటనే సినిమా చేసేద్దాం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. తాజాగా ఈ విషయాన్నీ 24 ప్రమోషన్ లో పాల్గొన్న విక్రం కుమార్ మీడియాతో  చెప్పుకొచ్చాడు. అలాగే మహేష్ కంటే ముందు తమిళ తెలుగు బాషలలో అల్లు అర్జున్ తో  ఓ  సినిమా చేయనున్నట్లు, మహేష్ తో సినిమా చేయడానికి ఇంకా కొద్ది రోజుల సమయం పడుతుందని ఇది కూడా తమిళ తెలుగు బాషలలో ఉంటుందని మీడియాతో తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -