చైతూతో హలో డైరెక్టర్ సినిమా
అక్కినేని కుటుంబానికి మరపురాని జ్ఞాపిక మనం. మూడు తరాలను ఒక ఫ్రేమ్లో చూపించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్. మనం సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అక్కినేని నాగేశ్వర్రావు గారు నటించిన చివరి సినిమా కూడా అదే కావడంతో అక్కినేని కుటుంబానికి ఆ సినిమాపై ప్రత్యేక అభిమానం. అందుకే ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో మనం సెట్స్ దహనమైతే నాగార్జున చాలా బాధపడ్డాడు. అక్కినేని కుటుంబసభ్యుడిగా విక్రమ్ కె కుమార్ అయ్యాడు.
అందుకే అఖిల్ను హలో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే విక్రమ్ తదుపరి సినిమా కూడా అక్కినేని వారసుడితోనేని నాగార్జున ప్రకటించారు. హలో ప్రమోషన్లో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. మరొకసారి విక్రమ్ కె కుమార్ మళ్లీ తమ అన్నపూర్ణ ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లు చెప్పాడు. నాగచైతన్యతో ఒక డిఫెరెంట్ సినిమాను చేస్తాడని ఆ సినిమా వచ్చే సంవత్సరం షూటింగ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ సినిమా చైతూతో ఉంటుందని టాక్. ఈలోగా విక్రమ్ ఒక స్టార్ హీరోతో సినిమా పూర్తి చేసి వస్తాడట. ఈ విధంగా చైతూతో తీస్తే అక్కినేని కుటుంబంతో విక్రమ్కు ముచ్చటగా మూడో సినిమా అవుతుంది.