తమిళ హీరో విశాల్కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.అతను తీసే ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది.విశాల్ రీసెంట్గా అభిమాన్యుడు సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు.ప్రస్తుతం విశాల్ నటించిన పందెంకోడి -2 విడుదలకు రెడీ అవుతుంది.ఈ సినిమా పందెంకోడికి సీక్వెల్గా వస్తుంది.లింగుస్వామినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశాడు దర్శకుడు. విలన్ క్యారెక్టర్లో వరలక్ష్మి చెప్పిన డైలాగ్స్ ట్రైలర్కే హైలైట్గా నిలిచాయి.ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సినిమాను అక్టోబర్ 18న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. విశాల్ కెరీర్లో మొదటి హిట్ ఇచ్చిన పందెంకోడికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.