Monday, May 6, 2024
- Advertisement -

ఫ‌లక్నుమా దాస్’ సీక్వెల్ తీస్తాను అంటున్న దర్శకుడు

- Advertisement -

ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ మధ్యనే ‘ఫలక్నుమా దాస్’ సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్ లు నమోదు చేస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఒక రేంజ్ లో ప్రమోషన్ లను చేసిన చిత్ర బృందం సినిమా విడుదలైన తర్వాత కూడా అదే జోరుతో ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు విశ్వక్ సేన్.

‘ఫలక్నుమా దాస్’ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ విశ్వక్ సేన్ తాను ఇండస్ట్రీ లోకి వచ్చింది ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్లిపోవడానికి కాదని ఇక్కడే ఉండటానికి అని భవిష్యత్తులో కూడా ఒక నటుడిగా, దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ‘ఫలక్నుమా దాస్’ కి సీక్వెల్ కూడా చేస్తానని, సినిమా కంటే దాని సీక్వెల్ మరింత అద్భుతంగా ఉండబోతోందని ఆ చిత్రాన్ని 2020 లో విడుదల చేస్తానని చెప్పాడు విశ్వక్ సేన్. కానీ ‘ఫలక్నుమ దాస్’ మలయాళం ‘అంగమలి డైరీస్’ కి రీమేక్ అని తెలిసిన విషయమే. ఆ సినిమాకి సీక్వెల్స్ ఏమీ లేవు. మరి విశ్వక్ సేన్ ‘ఫలక్నామా దాస్’ కి సీక్వెల్ ఎలా తీస్తాడో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -