దేవిశ్రీప్రసాద్ ,తమన్ ఇద్దరు కూడా టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్గా తమ హావాను చూపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు సంగీతం అందించారు వీరిద్దరు. కెరీర్ మొదటి నుంచి దేవిశ్రీ దుసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తక్కువ కాలంలోనే 50 సినిమాలకు సంగీతం అందించాడు తమన్. అయితే తమన్ కొన్ని ట్యూన్స్ను కాపీ కొడతాడనే అపవాదు ఉంది. కాని ఇటీవల కాలంలో తమన్ తన సంగీతంలో చాలా మార్పులు చేసుకున్నాడు. తమన్ చేత చేయించుకోవాలే కాని బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాడని చాలాసార్లు నిరుపితమైంది. తాజాగా తెలుగులో దేవిశ్రీ కన్నా తమన్కే ఎక్కువ డిమాండ్ ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ సరైన సంగీతం అందిచడం లేదని చాలామంది చెబుతున్నారు.
అతని మ్యూజిక్లో మునపటి జోష్ తగ్గిందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీంతో తమన్కే ఎక్కువు ఆఫర్లు ఇస్తున్నారట టాలీవుడ్ దర్శక-నిర్మాతలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెరీర్ మొదట్లో వరుసగా దేవిశ్రీ ప్రసాద్తోనే ఎక్కువ సినిమాలు చేశాడు. కాని వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని దేవిని పూర్తిగా పక్కన పెట్టుశాడు త్రివిక్రమ్. సన్నాఫ్ సత్యమూర్తి తరువాత వీరిద్దరు మళ్లీ కలిసి పని చేయలేదు. తాజాగా తన కొత్త సినిమాకు కూడా దేవిశ్రీని కాదని , తమన్ని తీసుకున్నాడు. త్రివిక్రమ్ – బన్ని కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బన్ని – దేవిశ్రీకాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్గా సూపర్ హిట్లు అయ్యాయి. బన్ని దేవిశ్రీని కావలని పట్టుబట్టినప్పటికి తమన్కే ఓటు వేశాడు త్రివిక్రమ్. మొత్తానికి టాలీవుడ్లో దేవీ క్రేజ్ తగ్గి తమన్ క్రేజ్ కాస్తా పెరిగిందని చెప్పాలి.
- Advertisement -
దేవిశ్రీ ప్రసాద్ వద్దు…తమన్ ముద్దు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -