Wednesday, May 15, 2024
- Advertisement -

వ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో చిక్కుల్లో ప‌డ్డ నాగ్ ఆఫీస‌ర్…

- Advertisement -

టాలీవుడ్ ప్ర‌స్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. న‌టి శ్రీరెడ్డి వ్య‌వ‌హారంతో కొన్నాళ్లు ఇబ్బంది ప‌డింది తెలుగు ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌. ఇప్పుడు ఆ వాఖ్యల వెనుక వివాస్ప‌ద డైర‌క్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మే ఒప్పుకోవ‌డంతో ఈ స‌మ‌స్య మ‌రింత ముదిరింద‌నే చెప్పాలి.శ్రీరెడ్డి జ‌న‌సేన అధినేత ,హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించింది.ప‌వ‌న్‌తో పాటు వాళ్ల అమ్మాగారిని కూడా బుతులు తిట్టే సరికి ఈ గొడ‌వ తార స్థాయికి చేరింది.రాంగోపాల్ వ‌ర్మ, శ్రీరెడ్డిపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామీలి మొత్తం తీవ్ర నిర‌స‌న తెలిపారు.ఈ రోజు ఉద‌యం ప‌వ‌న్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద కాసేపు హాల్ చ‌ల్ చేశారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు 24గంట‌ల స‌మ‌యం ఇచ్చి అక్క‌డ నుండి వెళ్లిపోయారు.

త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే దీక్ష చేస్తాన‌ని చెప్పి వెళ్లారు ప‌వ‌న్‌. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా మెగా ఫ్యామీలి హీరోలు ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. దీనిపై స్పందించిన వ‌ర్మ త‌ను చేసింది క్ష‌మించ‌రాని త‌ప్పే అని త‌న‌ను క్ష‌మించాల‌ని కొరుతున్నాని త‌న ఫేస్‌బుక్ ద్వారా తెలిపాడు.వీళ్ల గొడ‌వ ఏమో కాని వీళ్ల మ‌ధ్య అటు మా అసోసియేష‌న్ ఇటు హీరో నాగ‌ర్జున న‌లిగిపోతున్నారు.మా అసోసియేష‌న్‌కు ప‌వ‌న్ 24 స‌మ‌యం ఇచ్చి త‌న‌కు న్యాయం జ‌రగక‌పోతే దీక్ష చేస్తాన‌ని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక మా అసోసియేష‌న్ త‌ల ప‌ట్టుకుంది.

ఇక నాగ‌ర్జున‌కు ఈ గొడ‌వ‌కు సంబందం లేక‌పోయిన వ‌ర్మ వ‌ల్ల నాగ్ ఇబ్బంది ప‌డుతున్నాడు.ఎందుకంటే హీరో నాగ‌ర్జున వ‌ర్మ డైర‌క్ష‌న్‌లో ఆఫీస‌ర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయింది. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజిగా ఉంది చిత్ర యూనిట్‌.సినిమా మేలో విడుద‌ల‌కు రెడీ అవుతుంది.మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో వ‌ర్మ ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామీలితో గొడ‌వ పెట్టుకొవ‌డంతో ఆఫీస‌ర్ సినిమా ఏం అవుతుందో అని అందోళ‌న‌లో ఉన్నాడు నాగ‌ర్జున‌.మ‌రి ఇటు హీరో నాగ‌ర్జున కాని అటు మా అసోసియేష‌న్ కాని ఈ స‌మ‌స్య నుండి ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -