Friday, May 10, 2024
- Advertisement -

బాహుబలికి ‘ఈనాడు’ అంత ప్రాధాన్యతనిస్తోంది అందుకేనా?!

- Advertisement -

గత పక్షం రోజులు ఈనాడు సినిమా పేజీ వార్తలను గమనించినట్టు అయితే అందులో ఒకే సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా గురించిన వార్తలు తప్ప మరో సినిమా వారికి పట్టడం లేదు!

దాదాపు ఎనిభై శాతం కవరేజీని బాహుబలి సినిమాకే అంకితమిస్తోంది ఆ పత్రిక. మరి ఈ విధంగా ఆ సినిమాను ప్రమోట్ చేయడం వెనుక ముఖ్యమైన రీజనే ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

ఈ సినిమాలో ఈనాడు పత్రిక అధినేత రామోజీ రావు పెట్టుబడులుపెట్టాడని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆ పత్రికలో ఆ సినిమా గురించి అన్ని వార్తలు వస్తున్నాయని టాక్. సినిమా పేజీ అనే బలమైన మాధ్యమం ద్వారా వీలైనంత ఎక్కువగా బాహుబలి గురించి ప్రచారం చేయించుకొంటున్నారు. ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ గురించి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు వేస్తున్నారు!

 

దీనికంతటికీ కారణం ఆ సినిమాలో రామోజీ రావు పెట్టిన పెట్టుబడులే అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేదు. ఎలాగూ సినీ నిర్మాణ నేపథ్యం ఉంది కాబట్టి.. రామోజీ గురించి వస్తున్న పెట్టుబడులు పుకార్లకు ఊతం లభిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -