Friday, March 29, 2024
- Advertisement -

చిరు, బన్నీ లు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..??

- Advertisement -

టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు ఇప్పుడు కాపీ ల సెగ తగిలి సినిమా ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఒకటి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కాగ, మరొకటి అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా.. ఈ రెండు సినిమా లకు డైరెక్టర్ లు స్టార్ లే.. మొదటి సినిమా నుంచి మంచి మంచి వేరియేషన్స్ చూపించి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసిన వారే..కానీ వారి టైం బ్యాడో ఏంటో కానీ ఇద్దరికీ ఒకేసారి కాపీ సమస్య వచ్చి పడింది.. వాస్తవానికి కొరటాల శివ తో చిరంజీవి సినిమా ఇప్పుడే అనౌన్సు చేసింది కాదు, చాల రోజుల క్రితమే అనుకుంది..

అన్ని పూర్తయ్యాయి అనుకునే లోపు ఈ సినిమా కరోనా రూపంలో బ్రేక్ పడింది. దాంతో షూటింగ్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యింది.. ఇక కరోనా నుంచి విముక్తి పొందక ఈ కాపి సమస్య కొరటాల శివ మెడకు చుట్టుకుంది.. అదే సమయంలో పుష్ప సమయంలో సుకుమార్ ఆల్రెడీ షూటింగ్ కి కూడా వెళ్లారు.. కొంత షూటింగ్ కూడా పూర్తయ్యింది.. ఇక రేపో మాపో రిలీజ్ డేట్ కూడా ప్రకటిద్దాం లోపే  కాపీ సమస్య రావడంతో తలలు పట్టుకోవడం దర్శక నిర్మాతల వంతు అయ్యింది. అయితే ఈ సినిమా కథల మీద ఇంత ఇష్యూ అవుతున్నా హీరోలు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.. కరోనా సమయంలో చిరంజీవి పలుసార్లు బయటకి వచ్చి ప్రజలకు సందేశం ఇచ్చారు..

కానీ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని వారి వాదన.. ఇక సోషల్ మీడియా లో ఎప్పుడు అప్ డేట్ గా ఉంటూ ఫ్యామిలీ విషయాలు, ఫోటో లు తెగ పోస్ట్ చేసే బన్నీ ఈ విషయంలో మౌనంగా ఉండడంపై కొందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయట.. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు దర్శకులకు అండగా నిలవలనుకున్నా, యా కథ రచయితకు అండగా నిలవలనుకున్నా తప్పకుండ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది.. వారు ఎప్పుడు దీనికి సమాధానం చెప్తారో చూడాలి.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -