Thursday, May 16, 2024
- Advertisement -

శంకర్-ఎహసాన్-లాయ్ వాకౌట్.. తప్పెవరిది?

- Advertisement -

బాలీవుడ్ సినిమా పరిశ్రమ లో అగ్ర సంగీత దర్శకుల జాబితాలో ముందు ఉండే శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం దాదాపు గా అందరూ స్టార్ హీరోల తో పని చేసి అవార్డు విన్నింగ్ ఆల్బమ్స్ ని సృష్టించారు. అయితే తెలుగు లో అప్పుడెప్పుడో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా కిమాత్రమే సంగీత అందించిన వీరు చాలా కాలం తర్వాత సాహో సినిమా ని ఒప్పుకున్నందుకు సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణం గా కేవలం పాటలని మాత్రమే స్వరపరిచే వీరు నేపథ్య సంగీతం అందించడానికి దూరం గా ఉంటారు. అందుకే సినిమా కి సంబందించిన మేకింగ్ వీడియోస్ కి సంగీతం కోసం చిత్ర యూనిట్ థమన్ ని, జిబ్రాన్ ని అప్రోచ్ అయ్యారు.

తాజాగా ఈ త్రయం సినిమా నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తో ఒక్కసారి గా అందరిలో నిరుత్సాహం ఆవహించింది. ఇప్పటికే కొన్ని పాటల కి స్వరకల్పన జరిగిపోవడం తో, ఇప్పుడు అవి సినిమా లో ఉంటాయా లేవా అనే విషయం అందరినీ తికమక పెడుతుంది. ఇది పక్కన పెడితే ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏం అయ్యి ఉంటుంది అనే విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సంగీత దర్శకులు ఖాళీ గా ఉన్న సమయం లో దర్శక నిర్మాతలు అందుబాటు లో లేరు అని, వారికి కావలసినప్పుడు వీరు బిజీ గా ఉండటం జరిగిందట. చివరికి కొన్ని పాటలు స్వరపర్చడం జరిగినా కానీ చివరికి ఇప్పుడు వీరి మీద రికార్డింగ్ త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి తీసుకు వస్తుండటం తో క్వాలిటీ విషయం లో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు అని తెలుస్తుంది.

అయితే ఇదే అసలైన కారణం అని చెప్పడానికి లేదు. ఏది ఏమైనా చిత్ర యూనిట్ ఈ విషయం పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -