- Advertisement -
సాయి ధరమ్ తేజ్ భాగా ముదిరిపోయాడు. అతని లాంచ్ చేస్తోన్న టైమ్లో మేధావి అల్లు అరవింద్ ఏం చేస్తాడులే అనుకున్నారు. ఇపుడు అతని వాలకం చూస్తుంటే వారంతా భయపడుతున్నారు.
సాయి ఏంటి చిరు పాటలను, స్టైల్ ను ఇలా వాడేస్తున్నాడేంటి… అని వారు కంగారు పడుతున్నారు. ఇంకా ఇలాగే చూస్తూ కూర్చుంటే చిరు బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నింటిని అతను రీమిక్స్ ల రూపంలో వాడేసుకోవడం ఖాయమని ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చేశాడంటున్నారు.
అందుకే జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు సాయిధరమ్ ఇలా చిరంజీవిని సాంతంగా వాడేసుకోవడం అతనికి కూడా లాంగ్ రన్ లో మంచిది కాదని సినీ విమర్శకులు చెబుతున్నారు.ఇలాగే చిరు సాంగ్ లను రీమిక్స్ చేస్తూ కూర్చుంటే…రీమిక్స్ రాజా అనే పేరును కూడా అతను తెచ్చుకుంటాడంటున్నారు. మరి అలా చేయడం అతనికి సమీప భవిష్యత్ లో కరెక్ట్ కాదనేది అందరి వాదన.ఏం కాదంటారా..?