Friday, May 3, 2024
- Advertisement -

వామ్మో..! రవి తేజనా వద్దంటున్నా కుర్ర హీరోయిన్లు

- Advertisement -

మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా లో నాభ నటేష్ మరియు పాయల్ రాజపుట్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా అవ్వగానే రవితేజ తన తదుపరి చిత్రం డాన్ శీను, బలుపు సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో చేయనున్నాడు. ఈ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గ నటించబోతుంది అని అంతా చెప్పుకుంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమా కోసం ఫిలిం యూనిట్ ముందుగా రష్మిక వంటి యువ హీరోయిన్ల ని అప్రోచ్ అయ్యారట. కానీ యువ హీరోయిన్లు అంతా రవి తేజ తో పని చేయడానికి ఇష్ట పడడం లేదు అని తెలుస్తుంది. డేట్స్ లేవు అనో, ఇంకో కారణం చెప్పో రవి తేజ సినిమా కి కుర్ర హీరోయిన్లు నో చెపుతున్నారట.

అందుకే రవి తేజ ఇంతకు ముందు పని చేసిన హీరోయిన్లని మళ్ళి తీసుకొని వస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. రవి తేజ కి ఒక హిట్ పడితే కానీ ఆయన అనుకున్నవి జరిగేలా లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -