ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథను యాత్ర పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వైఎస్ఆర్ రోల్లో మళయాళ సూపర్స్టార్ మమ్మూట్టి కనిపించనున్నారు.ఇప్పటికే విడుదల అయిన టీజర్,సాంగ్స్కు సూపర్బ్ రెస్పన్స్ వచ్చింది.తాజాగా సినిమాకు సంబధించిన వార్త ఒకటి సోషల్ మీడిలో చక్కర్లు కొడుతుంది.యాత్రలో వైఎస్ జగన్ గురించి ప్రస్తావనే ఉండదట.సినిమా మొత్తం రాజశేఖరరెడ్డి గురించి మాత్రమే ఉంటుందని సమాచారం.
రాజశేఖర రెడ్డి పాదయాత్ర ,ఆయన సీఎం అవ్వడం గురించే ఉంటుందని తెలుస్తుంది.సినిమాలో జగన్ పాత్ర పెడితే అది రాజశేఖర రెడ్డి పాత్రపై ఫోకస్ తగ్గుతుందని భావించిన చిత్ర యూనిట్ సినిమాలో జగన్ పాత్రనే లేకుండా చేశారని సినీ వర్గాల వినికిడి.జగన్ పాత్ర ఉంటే అది రాజశేఖర రెడ్డి పాత్రనే డామినేట్ చేస్తుందని జగన్ పాత్రను కట్ చేశారట.ప్రేక్షకులంతా రాజశేఖర్ రెడ్డి పాత్రతోనే కొనసాగాలనే ఉద్దేశంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.ఇక సినిమాను వైఎస్ జగన్ పుట్టిన రోజున విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.