డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయలలో పెను సంచలనం సృష్టించిన వ్యక్తి. ఆయన మరణం తరువాత రాష్ట్రం రెండు ముక్కలు అయిన సంగతి తెలిసిందే. ఇక జీవిత కథను యాత్ర అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(జూన్ 8,ఆదివారం) వైఎస్ఆర్ జయంతి సందర్భంగా యాత్ర సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. వైఎస్ఆర్ పాత్రను మళయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్న సంగతి తెలిసిందే.
వైఎస్ఆర్ రాజకీయ జీవితాన్ని మార్చేసిన పాదయాత్రను ప్రధాన అంశంగా తీసుకుని యాత్ర సినిమాను తీస్తున్నారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి సరిగ్గా సరిపోయారనే చెప్పాలి.అచ్చం ఆయన పంచె కట్టు,ఆయన హవభావాలతో మెప్పించాడు మమ్ముట్టి. ట్రైలర్లో వచ్చేథీమ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి,వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయలని భావిస్తున్నారు. యాత్ర సినిమాకు రాఘవ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.