Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు పోటీగా వైఎస్ఆర్‌…రెండు ఒకే రోజున విడుద‌ల‌లైతే?

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రులైన ఎన్టీఆర్‌కు , వైఎస్ఆర్‌ల జీవిత క‌థ‌ల‌ను సినిమాగా తెర‌క‌క్కిస్తున్నారు.ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఆయ‌న త‌న‌యుడు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్నాడు.వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ళ‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌టిస్తున్నారు.వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర‌ను మొద‌ట డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని భావించారు.కాని చిత్ర యూనిట్ సినిమాను జ‌న‌వ‌రికి వాయిదా వేశారు.జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి పోటీగా నిల‌పాల‌ని భావిస్తుంది యాత్ర చిత్ర యూనిట్‌. ఎన్టీఆర్ చిత్రాన్ని ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు, యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు.

‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్‌ బయోపిక్‌ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్ర యూనిట్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం.యాత్ర సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు.ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.రెండు పార్టీలకు చెందిన నేత‌ల బ‌యోపిక్ సినిమాలు ఒకేరోజు విడుద‌ల అయితే ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -