- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్తో కలిసి జీరో సినిమాలో నటించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. జీరో సినిమా ప్రమోషన్స్లో పాల్గోన్న కత్రినా ..కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది. ‘జీరో’ సినిమా కథ విన్నప్పుడు నటించాలని అనుకోలేదని కానీ డైరెక్టర్ ఫోర్స్ చేయడంతో ఒప్పుకున్నానని అంటోంది.
షారుఖ్ ఖాన్ హీరోగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ‘జీరో’ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో కత్రినా ఓ స్పెషల్ రోల్లో కనిపించనుంది. ఓ తాగుబోతు క్యారెక్టర్లో కత్రినా కనిపించనుంది. ఇక ఈ సినిమా తనకు ఇష్టలేకపోయిన దర్శకుడు బలవంతం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.