- Advertisement -
ప్రపంచంలో ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మరోవైపు అకాల మృత్యువుతో పలువురువు చనిపోతున్నారు. ప్రకృతి వైపరిత్యాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా బంగ్లాదేశ్ లో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో నిత్యం వందలాది మంది పడవలపై ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ పడవల్లో ఎక్కువగా ఇసుక రవాణా చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే పద్మ నదిలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న నౌకను ఇసుక నౌక ఢీకొన్నది. అందులో ఓ పడవలో ప్రయాణిస్తున్న 25 మంది నిట మునిగిపోయారు.
ఐదుగురిని ప్రయాణికులను పోలీసులు రక్షించారు. అయితే, ఇంకా కొంతమంది నదిలో కొట్టుకు పోయారని, వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పద్మ నదిలో జరిగిన ప్రమాదం పట్ల అక్కడి ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.