క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపేస్తున్న ఐపీఎల్ 2021 పై కరోనా ఎఫెక్ట్ భారీగానే పడింది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. కొల్కతా జట్టులోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గత నాలుగు రోజులుగా చేసిన టెస్టుల్లో మూడో రౌండ్లో కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయ్యారు.
దీంతో ఫ్రాంచైజీ మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయింది. క్రిక్బజ్ అంచనా ప్రకారం ఐపీఎల్ 2021లో ఈరోజు జరగాల్సిన 30వ మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. స్థానిక గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేస్తున్నట్టు క్రిక్బజ్ చెబుతోంది. అకస్మాత్తుగా మ్యాచ్ వాయిదా వేయడానికి గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు.
కాగా, జట్టులో ప్లేయర్లు కోవిడ్ పాజిటివ్ తేలడంతో కోల్కతా జట్టు బెంగళూరుతో మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇతర జట్ల ఆరోగ్యాలు కూడా ముఖ్యమేనని ఐపీఎల్ తెలిపింది. కేకేఆర్ ఫ్రాంచైజీ మొత్తాన్ని ఐసోలేషన్కు తరలించి నిరంతరం పర్యవేక్సిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
ఆరోజు వేదిక వెనక్కెళ్ళి ఏడ్చాను.. అనుష్క శర్మ!