అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయాయని.. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ ద్వారా విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, సబ్బం హరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ నెల 15న పాజిటివ్ నివేదిక రాగా వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోంక్వారంటైన్లో ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. తాజాగా సబ్బం హరి కన్నుమూశారన్న వార్త విని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.