Thursday, April 25, 2024
- Advertisement -

బోయిన్‌పల్లిలో విషాదం.. నాలాలో పడి బాలుడు మృతి

- Advertisement -

హైద‌రాబాద్‌లోని న్యూబోయిన్‌ప‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పపడిపోయాడు. ఇటీవల వరుసగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.. దాంతో అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది.

నాలాలో పడ్డ బాలుడు విషయం తెలియగానే స్థానికులు అక్కడ చేరుకునే లోపే అనర్థం జరిగిపోయింది.. ఆనంద్‌ సాయి గల్లంతయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు గాలించి.. ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు.

బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు కళ్లముందే ఆడుకుంటూ సందడి చేసిన కొడుకును అంతలోనే నాలా మింగేయటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత మరోసారి జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా?

చిన్నారి సింధు శ్రీ హత్య కేసులో వీడిన మిస్టరీ

లాక్ డౌన్ లో భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అదేనంట?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -