- Advertisement -

వీడియో..పోలీస్ వాహనం ముందే బైక్‌పై స్టంట్లు

- Advertisement -

ఢిల్లీలో మరోసారి ప్రమాదకరమైన బైక్ స్టంట్లు కలకలం రేపాయి. నగరంలోని కొత్వాలి సర్కిల్ పరిధిలో, అశు అనే యువకుడు ఏకంగా పోలీసు వాహనం ముందే బైక్‌పై స్టంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో అతను రోడ్డుపై జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తూ, హ్యాండిల్ వదిలేసి బైక్‌పై నిలబడి ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఈ సమయంలో రోడ్డు మీద ఇతర వాహనాలు కూడా ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా, అతను ఏమాత్రం వెనుకాడలేదు.

ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి స్టంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వీడియో ఆధారంగా వెంటనే స్పందించిన పోలీసులు, యువకుడు అశును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేయడం ప్రమాదకరం మాత్రమే కాకుండా చట్టరీత్యా శిక్షార్హం కూడా. సోషల్ మీడియా కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతవరకు ఉందో స్పష్టమవుతోంది.

https://www.instagram.com/reels/DWwfJhEgSyU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -