కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలుకు చెందిన ప్రతాప్, హేమలత దంపతులు. వారికి కుమారుడు జయంత్, కూతురు రిషిత ఉన్నారు. ప్రతాప్ టీవీ మెకానిక్గా పని చేస్తున్నాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైట్ నోట్లో వెల్లడించారు. జీవితం పై విరక్తి చెందామని.. ఈ మద్య కాలంలో తమ స్నేహితులు, బంధువులు మరణించారని అది తట్టుకోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్టు సమాచారం.
అయితే ఉదయం ఇంట్లోనుంచి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, వీరి ఆత్మహత్యకు సూసైడ్ నోట్లో పేర్కొన్న వివరాలు నిజమా.. ? కదా అని దర్యాప్తు చేస్తున్నారు.
షాక్.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్!
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా తెలుగు తేజం కరణం మల్లీశ్వరి!