ఆ మద్య ఘట్కేసర్లో ఓ బీ ఫార్మసీ విద్యార్థిని తనను కిడ్నాప్ చేశారని, తనపై అత్యాచారం జరిగిందని డ్రామాలు ఆడి కలకలం రేపిన విషయం తెలిసిందే. కిడ్నాప్, రేప్ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్కేసర్లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలోనూ తమకు లభ్యమైన ఆధారాలతో పోల్చితే బాధితురాలు చెప్పే విషయాలలో పొంతన లేకపోవడంతో ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తేల్చిచెప్పారు. అయితే కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలు చేసి పోలీసులు, మీడియాను ఆమె తప్పుదోవ పట్టించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దాంతో అవమానంగా ఫీల్ అయిన విద్యార్థిని తన కుటుంబ సభ్యులతో ఉండలేకపోయింది. ఇటీవలే ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయి, తన ఇంట్లో కాకుండా అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేసే అవకాశం ఉండడం, ఆమెపై అందరి నుంచీ తీవ్ర విమర్శలు వస్తుండడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కారణంగానే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
అక్షర సినిమా విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తుంది: ఎమ్మెల్సీ కవిత..!