- Advertisement -

చెదిరిపోయిన ప్రేమ జంట కల

- Advertisement -

నిశ్చితార్థం అనంతరం గల్ఫ్‌లో ఆర్థిక ఇబ్బందులతో ప్రియుడి ఆత్మహత్య, మనస్తాపంతో ఇండియాలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన శృతి(20)ని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఏడు నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్నాడు సాయికుమార్(22) అనే యువకుడు.

అయితే తనకు ఇల్లు లేదని ఇల్లు కట్టుకొని ఆర్థికంగా బలపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి బహ్రెయిన్ వెళ్లారు సాయికుమార్. ఈ నెల 1వ తేదీన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బహ్రెయిన్‌లో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకుని అదే రోజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది శృతి. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంట మరణంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -