Thursday, May 2, 2024
- Advertisement -

యూపీలో మ‌రో దుర్ఘ‌ట‌న‌..కుప్ప‌కూలిన‌ ప్లైఓవ‌ర్‌..

- Advertisement -

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. బస్తీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ ఈ ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో అక్కడ మరెవరూ లేకపోవడంతో… ప్రాణ నష్టం తప్పింది.

గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో వర్షం పడుతుండటంతో ఫ్లై ఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన బీమ్‌లు భూమిలోకి దిగబడిపోయాయని దీంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. జాతీయ రహదారి 28పై లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. ప్రమాదపు సమాచారాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -