Thursday, April 25, 2024
- Advertisement -

ఉత్తర ప్రదేశ్ ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి

- Advertisement -

ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలోని టిక్రి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నురుల్ హాసన్ అనే వ్యక్తి కుటుంబం ఇంట్లో వంట చేస్తోంది.

ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారి పేలింది.. ఈ పేలుడు ధాటికి పక్కన మరో రెండు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్ పి సంతోష్ కుమార్ మిశ్రా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -