- Advertisement -
కుంభకోణాలు టీడీపీ నేతలను వదలడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మొదలుకొని కొంతమంది నేతలకు స్కాంలు మెడకు చుట్టుకోగా ఇందులో చంద్రబాబు అయితే జైలుకు సైతం వెళ్లివెచ్చారు.
ఇప్పుడు మాజీ మంత్రి,టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు వంతు వచ్చేసింది. టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకుని జీఎస్టీ ఎగవేసిన ఆరోపణలపై శరత్ ను పోలీసులు అరెస్టు చేయగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.
ప్రత్తిపాటి శరత్తో పాటు ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్విత్ 34 కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది కూడా ఉన్నారు. రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.