Friday, May 17, 2024
- Advertisement -

బ్రేకింగ్‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం…26 మంది చిన్నారులు మృతి

- Advertisement -

హిమచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సర్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 26మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా ఐదో తరగతిలోపు వారేనని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం.. గాయాలపాలైన చిన్నారులను ఆసుపత్రికి తరలిస్తోంది. కాగా కొంత మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొని, ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -