Sunday, May 5, 2024
- Advertisement -

బీజేపీకి 6..అభ్యర్థులు వీరే?

- Advertisement -

ఏపీలో టీడపీ -బీజేపీ – జనసేన మధ్య పొత్తు పొడిచింది. పొత్తుపై బీజేపీ అధికారిక ప్రకటన చేస్తూ టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలు కేటాయించగా జనసేన రెండు స్థానాల్లో పోటీ చేయనుంది.

ఇక బీజేపీకి కేటాయించిన ఆరు స్థానాలతో పాటు అభ్యర్థులు కూడా ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. అనకాపల్లి నుండి సీఎం రమేష్,అరకు స్థానం నుంచి గీత, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్, హిందూపూరం నుంచి – సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్‌తో పాటే బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. విజయవాడ, విశాఖపట్నం ఎంపీ సీట్లు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టిన చంద్రబాబు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -