Thursday, May 2, 2024
- Advertisement -

ఏపీ కాంగ్రెస్‌లో మొదలైన చేరికల పర్వం!

- Advertisement -

ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేయగా ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక షర్మిల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హష్తం పార్టీలో చేరారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్లతో పాటు శెట్టి గంగాధర్, మరికొందరు వైసీపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. సీనియర్లు సైతం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే హస్తం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నదే షర్మిల ముందున్న అతిపెద్ద సవాల్.

ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయమే ఉండగా గ్రామ స్ధాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం,అభ్యర్థుల ఎంపిక,ప్రజల మన్నన పొందడం ఇలా ఎన్నో సవాళ్లు షర్మిల ముందున్నాయి. వీటన్నింటిని ఆమె ఏ విధంగా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -