Monday, May 20, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్..ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు న్యాయస్థానాలను, ఏసీబీతో పాటు హైకోర్టు జడ్జిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే టీడీపీ నేతల తీరుపై ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా ఇవాళ న్యాయస్థానం టీడీపీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయింది.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి నోటీసులు జారీ చేయగా తాజాగా ఇవాళ మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

జడ్జిలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పాటు టీడీపీ అనుకూల ఛానళ్లతో మాట్లాడుతూ కించపరిచే కామెంట్స్ చేశారు. దీనిని కోర్టు ధిక్కరణగా భావించిన హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక టీడీపీ నేతలతో పాటు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. దీంతో టీడీపీ నేతలకు షాక్ తగిలినట్లైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -