టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చింది బీజేపీ. ఇప్పటికే టీడీపీ – జనసేన మధ్య పొత్తు కుదరగా త్వరలో బీజేపీ చేరనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే సీఎం పదవి నీకా?, నాకా? అంటూ రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు జరుగుతుండగా తాజాగా బీజేపీ కూడా అదే డిమాండ్ని తెరపైకి తెచ్చింది.
టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కలవాలంటే సిఎం అభ్యర్థిగా తమ పార్టీ అభ్యర్థే ఉండాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్థన్. ఏపీలో బీజేపీ బలహీన పార్టీ అనుకుంటే పొరపాటేనని, తమ పార్టీ బలమైనది కాబట్టే పొత్తుల కోసం ఇతర పార్టీలు ఆరాటపడుతున్నాయన్నారు.
ఇక ఇప్పుడు విష్ణు వర్ధన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ, జనసేన నేతలే సీఎం పదవి తమకంటే, తమకని కొట్లాడుతుండగా ఇప్పుడు బీజేపీ చేసిన డిమాండ్ తో చంద్రబాబుకు ఖచ్చితంగా షాక్ అనే చెప్పాలి.