Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబు విలువ గుండుసున్నా!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు విలువ గుండు సున్నా అన్నారు ఏపీ సీఎం జగన్. అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సిద్ధం సభలో మాట్లాడిన జగన్…పవన్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. జగన్‌ను ఎదుర్కొవడానికి దత్తపుత్రుడు పవన్‌ను తెచ్చుకున్నారని…సైకిల్ ఎప్పుడు రిపేర్‌కు వచ్చినా తోయమంటే తోస్తాడాని పవన్‌కు చురకలు అంటించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొత్తు పెట్టుకుంటాడు..విడిపోతాడన్నారు. పవన్ చంద్రబాబుకు కూర్చోమంటే కూర్చుంటాడు..నిల్చోమంటే నిల్చుంటాడన్నారు.

చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు లేవని, చక్రలు లేవు…అసలు సైకిల్ పనికిరాదని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు లాగా తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని ప్రజలకే తన స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. చంద్రబాబుతో పోరాటానికి సిద్ధమా అని ప్రజలనుద్దేశించి అన్నారు జగన్. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేశారు. పొత్తులతో- జిత్తులతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

జగన్ మార్క్ అభివృద్ధిలో కనిపిస్తోందన్నారు. గతంలో మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్టలో వేశారన్నారు. చంద్రబాబు ఏది చెబితే పవన్ అది చేస్తారన్నారు. చంద్రబాబు ఎంతమందితో పొత్తు పెట్టుకున్న ఫలితం సున్నా అన్నారు. అసలు చంద్రబాబు విలువే గుండుసన్నా అని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా ఆలోచించాలన్నారు.

మాట తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేసినందుకే మన ఫ్యాన్‌కు కరెంట్ వస్తుందన్నారు.ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నానని తెలిపారు జగన్. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని…వాళ్ల వెనుక ప్రజలు లేరు కాబట్టే అరడజను పార్టీలతో పొత్తుతో ముందుకు వస్తున్నారన్నారు.విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదన్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -