Thursday, May 2, 2024
- Advertisement -

నేను పవన్ సేమ్ అంటున్న బాలయ్య!

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం పెంచేందుకు ఓ కమిటీని వేసి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య..జనసేన – టీడీపీ సమన్వయ కమిటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యజ్ఞంలో సమిధ కావడానికి పవన్ సిద్ధమయ్యారని ఆయన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా అని చెప్పారు. ఇక పవన్‌ది తనది ఒకటే భావజాలం అని దేనికీ భయపడని వ్యక్తిత్వం మా ఇద్దరిది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జై టీడీపీ.. జై జనసేన అని నినాదాలు చేశారు. ఇక టీడీపీ – జనసేన కలయిన కొత్త శకానికి నాంది అన్నారు. ప్రజలకు టీడీపీ కార్యకర్తలు,జనసైనికులు రక్షక భటులుగా ఉంటారన్నారు. ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని… గతంలో ఎన్టీ రామారావు కూడా పార్టీలన్నింటినీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేశారని తెలిపారు.

ఇక బాలయ్య చేసిన వ్యాఖ్యలు జన సైనికుల్లో జోష్ నింపినా సీట్ల ఖరారు, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చిన తర్వాత అసలు సంగతి బయటపడుతుంది. టికెట్ దక్కని నేతలని బుజ్జగించడం ఈ రెండు పార్టీలకు తలకు మించిన భారం. ఎందుకంటే పొత్తు ఉంటుందని ప్రకటించినప్పుడే జనసేన నుండి కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. అలాంటిది పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తే జనసేన ఖాళీ అవడం ఖాయమనే టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -