Sunday, April 28, 2024
- Advertisement -

బండి వర్సెస్ పొన్నం..హీటెక్కిన కరీంనగర్!

- Advertisement -

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తన యాత్రను అడ్డుకోవడమే పొన్నం లక్ష్యంగా పెట్టుకున్నారని,శ్రీరాముడి పుట్టుక గురించి వివాదాస్పద కామెంట్స్ చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు బండి.

అయితే బండి ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మంత్రి పొన్నం. తన దయతోనే బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాడని ఆరోపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి రాజకీయ సన్యాసం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఇక శ్రీరాముడి గురించి తాను అనని మాటలను అన్నట్లుగా బండి సంజయ్ చెప్పారని…ఒకవేళ తాను ఆ మాటలను అన్నట్లు నిరూపిస్తే సజీవ దహనం అయ్యేందుకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక తన తల్లి గురించి అవమానంగా మాట్లాడిన బండి…ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తాడని అనుకోలేదన్నారు. పొద్దున లేస్తే మాంసం, మద్యం లేకుండా బతకని వ్యక్తి బండి సంజయ్..అలాంటి వాడు భక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తంగా బండి సంజయ్ వర్సెస్ పొన్నంగా కరీంనగర్ పాలిటిక్స్ మారిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -