Saturday, May 4, 2024
- Advertisement -

ఇవేం పాలిటిక్స్‌..బీజేపీ నేతలకు జనసేన టికెట్లా!

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్నది ఇంకా సందిగ్దంగానే ఉంది. ఎందుకంటే బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. దీంతో బీజేపీ ఒంటరిగా దిగుతుందా అన్నది మరికొద్దిరోజుల్లోనే తెలియనుంది.

ఇక తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు పవన్. ఈ మేరకు మంగళవారం బీజేపీ నిర్వహించిన బీసీ సభకు ప్రధాని మోడీతో పాటు హాజరయ్యారు జనసేనాని. ఇంతవరకు బాగానే ఉన్నా 323 స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించి కేవలం 8 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను బరిలో దింపారు. ఇందులో ఇద్దరు బీజేపీ నేతలు. జనసేన ప్రకటించిన 8 స్థానాల్లో ఇద్దరు బీజేపీ నేతలకు సీట్లు ఇచ్చారు పవన్.దీంతో ఈ మాత్రం దానికి జనసేన పోటీ చేయడం ఏంటని అందరి నుండి విమర్శలు వస్తున్నాయి.

కూకట్‌ పల్లి నుండి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్ రావు టికెట్లు దక్కించుకోగా వీరిద్దరు ఈ నెల 6నే జనసేనలో చేరి 7న టికెట్ దక్కించుకున్నారు. వీరిద్దరూ బీజేపీ నేతలే కావడం విశేషం. ఇక లక్కినేని సురేందర్ రావు గత నెల 9న కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు. కొత్తగూడెం టికెట్ ఆశీంచగా ఇది జనసేనకు కేటాయించడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జనసేనలో చేరిపోయారు. మొత్తంగా బీజేపీ నేతలకు టికెట్ ఇచ్చి నవ్వుల పాలయ్యారు పవన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -