ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుంటున్న టీడీపీ..తెలంగాణలో మాత్రం కాంగ్రెస్తో జట్టు కట్టింది. దీంతో చంద్రబాబు తీరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారగా తాజాగా టీటీడీపీ నేతలకు మార్గనిర్దేశనం కూడా చేసినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై కీలక నేతలతో సమావేశంలో హితబోధ చేశారట చంద్రబాబు.
కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు తెలపడానికి ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవాలని సూచించారట. ఇందులో భాగంగా కుల లేదా ఉద్యోగ సంఘాల సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థులను ఆహ్వానించి ఓటు బ్యాంకు వారికి అనుకూలంగా మారేలా చర్యలు తీసుకోవాలని చెప్పారటని ఇన్ సైడ్ టాక్. బహిరంగంగా టీడీపీ అని చెప్పకుండా ఇన్ డైరెక్ట్గా టీడీపీ శ్రేణులకు, సానుభూతి పరులకు అర్ధం అయ్యేలా చెప్పాలని తెలిపారని సమాచారం.
ఇక ఇదే సమావేశంలో రేవంత్ రెడ్డి కోసం మీరు ఇప్పుడు పనిచేస్తే…భవిష్యత్లో మీ కోసం రేవంత్ పనిచేస్తారని హామీ ఇచ్చారట చంద్రబాబు. ఇక సమావేశానికి రాని నేతలకు ఫోన్ ద్వారా మాట్లాడారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనే టీడీపీకి మనుగడ అంటూ సూచించారట. మొత్తంగా ఏపీ రాజకీయాల వైపు కాకుండా తెలంగాణ పాలిటిక్స్లో బిజీ అయిపోయారట చంద్రబాబు. మరి కాంగ్రెస్కు మద్దతిచ్చిన టీడీపీ…ఎలాంటి ఫలితాలను రాబడుతుందో వేచిచూడాల్సిందే.