Sunday, May 19, 2024
- Advertisement -

ఢిల్లీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్‌పైనే ఆశలు

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సుప్రీం కోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్‌ విచారణకు రానుండగా ఇక ఇదే వారంలో సెక్షన్ 17ఏ కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో బాబు ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్నారు. క్వాష్ పిటిషన్‌పై బాబు రిలీఫ్ దక్కితే కేసుల గండం నుండి గట్టెక్కినట్లే లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఇక ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు స్వాగతం పలికారు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి హస్తినకు చేరుకోగా లాయర్ సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు.

గత కొన్నాళ్లుగా వైసీపీ తరపున గెలిచినా టీడీపీ ఎజెండాను ఫాలో అవుతూ వస్తున్న రఘురామ..ఎయిర్‌పోర్టులో బాబును కలిసి స్వాగతం చెపపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఎల్లో మీడియా,టీడీపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇక బాబు బెయిల్ కోసం ఢిల్లీలో విశ్వప్రయత్నాలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -