Saturday, April 27, 2024
- Advertisement -

సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాం:జగన్

- Advertisement -

ఈ ఐదేళ్లలో సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగామన్నారు సీఎం జగన్. రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్..14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా? ఆలోచించాలన్నారు.

ఈ ఐదేళ్లలో ఏ పార్టీ అని చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించామన్నారు. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని…. అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు వారి అకౌంట్లలో నేరుగా డబ్బులు జతచేశామన్నారు.

ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారని …తన కంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారని… తనకన్నా వయసు, అనుభవం ఎక్కువ ఉన్న వారు ఈ ఐదేళ్లలో వైసీపీ చేసినదాంట్లో కొంచెమైనా చేయలేకరపోయారన్నారు. ఈ ఐదేళ్లలో గ్రామాలు బాగుపడ్డాయని… ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ఈ ఎన్నికలు మన తలరాతను, భవిష్యత్తును మార్చే ఎన్నికలు…అందుకే మంచిని చూసి ఓటు వేయాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -