తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ ట్విట్టర్ ద్వారా నెల రోజుల పాలనపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈనెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన పేర్కొన్నారు.
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ,పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని వెల్లడించారు.
పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణకోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని అన్నారు. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని…మీ రేవంతన్న అని పేర్కొన్నారు.ఇక సీఎం రేవంత్కు రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2024
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT