Sunday, April 28, 2024
- Advertisement -

హీరో నితిన్ మేనమాకు షాకిచ్చిన కాంగ్రెస్..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీస్ట్ ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ప్రముఖంగా పార్టీలో మొదటి నుండి కష్టపడిన వారికి కాకుండా పారాచ్యూట్ నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఇక ప్రధానంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నగేష్ రెడ్డి…నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశీంచారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్నారు. ఎంతమంది నేతలు పార్టీని వీడినా ఆయన మాత్రం హస్తం జెండానే మోశారు. ఇక హీరో నితిన్‌కు స్వయానా మేనమామ కూడా.

ఇక నగేష్ రెడ్డికి టికెట్ వస్తే నితిన్ ప్రచారం నిర్వహిస్తానని కూడా చెప్పారు. దీంతో అంతా నగేష్‌ రెడ్డికి టికెట్ ఖాయమనే అనుకున్నారు. ఎందుకంటే నితిన్ సినీ గ్లామర్ పార్టీకి ప్లస్ అవుతుందని భావించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిజామాబాద్ రూరల్ టికెట్‌ని ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి కేటాయించింది. దీంతో నగేష్ రెడ్డితో పాటు నితిన్ అభిమానులంతా ఖంగుతిన్నారు.

అయితే తనకు టికెట్ రాకపోవడం బాధగా ఉందని చెప్పినా కాంగ్రెస్ పార్టీని వీడనని చెప్పారు నగేష్. పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తానని తన అభిమానులెవరు తొందర పడొద్దన్నారు. తాను ఇప్పటికి, ఎప్పటికి కాంగ్రెస్ లాయలిస్టునేనని చెప్పారు. ఇక కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితా, 45 మంది సెకండ్ లిస్ట్‌ని రిలీజ్ చేయగా ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -