Monday, May 20, 2024
- Advertisement -

నెల్లూరు టీడీపీలో వర్గపోరు..

- Advertisement -

ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా టీడీపీలో వర్గపోరు మాత్రం చల్లారడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు భగ్గుమన్నాయి. చేజర్ల మండలం నాగులవెల్లటూరులో గురువారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలోనే కేశవ చౌదరి, రవీంద్ర నాయుడు వర్గాలు కొట్టుకున్నాయి. రవీంద్రనాయుడు ఇవాళ టీడీపీలో చేరనుండగా కేశవ చౌదరి ఇంటికి వస్తానని చెప్పి ఆనం రాకపోవడంతో గొడవ మోదలైంది. దీంతో కేశవ చౌదరి వర్గీయులు.. రవీంద్ర ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు.

ఒకరినొకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. ఈ కొట్లాటలో టీడీపీ అభ్యర్థి ఆనంను సైతం పక్కకు తోసేశారు. దీంతో గత్యంతరం లేక అక్కడి నుండి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -