Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబుపై దస్తగిరి పిల్..

- Advertisement -

వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి యూ టర్న్ తీసుకున్నారు. టీడీపీ, వైఎస్ సునీత, షర్మిలపై హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారన్నారు దస్తగిరి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అన్నారు.

ఈ వార్తలను పదేపదే ప్రచారం చేస్తున్న ఏబీఎన్, టీవీ ఫైవ్, ఈ- టీవీ లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దస్తగిరి. ఎలక్షన్ నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైయస్ సునీత మరియు వైయస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారన్నారు.

వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరారు దస్తగిరి. పులివెందుల నుండి పోటి చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారబోతుందన్నారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయటం ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి వ్యతిరేకమైందన్నారు. తక్షణమే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసుపై ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించవద్దు అంటూ మీడియాకు కూడా ఆదేశాల ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు.

ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతుందని…మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ రూల్స్ పూర్తిగా తుంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలలో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత వైయస్ షర్మిల మరియు పులివెందుల టిడిపి అభ్యర్థి బీటెక్ రవి పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. తక్షణమే రాష్ట్ర అదృత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో కోరారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -