Thursday, May 2, 2024
- Advertisement -

విజయవాడ తూర్పు వైసీపీదే!

- Advertisement -

బెజవాడ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ఈసారి భంగపాటు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈసారి వైసీపీ ఇంఛార్జీ, యువ నేత దేవినేని అవినాష్ నుండి గట్టి పోటీ ఎదురుకావడమే కాదు గద్దె రామ్మోహన్ ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

బలమైన కమ్మ సామాజిక వర్గంతో పాటు స్థానికుల అండదండలు అవినాష్‌కు మెండుగా ఉన్నాయి. ఇక ప్రధానంగా విజయవాడ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆటోనగర్. ఈ ప్రాంతంలో కూడా ఈసారి అవినాష్‌కే మద్దతిస్తామంటున్నారు స్ధానికులు.

ప్రజాప్రతినిధి కాకపోయిన తమ సమస్యలను దగ్గరుండి అవినాష్ పరిష్కరిస్తున్నారని ప్రజలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. అవినాష్ ప్రజా సేవ ముందు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తేలిపోయారు. దీనికితోడు ఏ కార్య‌క్ర‌మానికీ కూడా గ‌ద్దె రావ‌డం లేదు.దీనికి తోడు అవినాష్ మాటల తూటాల, యువత ఆయన వైపే ఉండటంతో ఈసారి వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది.అందుకే అవినాష్ గెలుపుపై కాదు మెజార్టిపైనే చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -