Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీకి గొల్లపల్లి గుడ్ బై?

- Advertisement -

టీడీపీ – జనసేన టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. టికెట్ దక్కని నేతలంతా పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీని వీడేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఈ మేరకు విజయవాడలో ఎంపి కేశినేని నానితో భేటీ అయ్యారు గొల్లపల్లి. నాని కార్యాలయంలో కీలక నేతల భేటీ జరుగగా ఎంపీ మిథున్ రెడ్డి సైతం ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి ఉండగా తెలుగుదేశం పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరే అవకాశం ఉంది.

రాజోలు టికెట్‌ను ఆశీంచారు గొల్లపల్లి. టికెట్ తనకే వస్తుందని ఆశించి నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకుంటు వస్తున్నారు. అయితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గొల్లపల్లి చివరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -