ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో నివాళి అర్పించిన అనంరతం ఎన్నికల రణరంగంలో అడుగుపెట్టారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలతో పాటు విజయమ్మ కూడా పాల్గొన్నారు. మేమంతా సిద్ధం అనే పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజుల వరకు కొనసాగనుంది.
ఇక జగన్ బస్సు యాత్రకు అడుగుడునా జనం నీరాజం పట్టారు.దారిపొడవునా జనం స్వాగతం పలికారు. మధ్యలో జగన్ బస్సు దిగి, ప్రజలను పలకరించారు. వారి వినతులను స్వీకరించారు. ఇడుపులపాయా ఏస్టేట్ దగ్గర పేరాలసిస్ పేషంట్ను ఆప్యాయంగా పలకరించారు జగన్.
ఇవాళ బస్సుయాత్ర ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు అనంతరం బహిరంగ సభ జరగనుంది.బస్సు యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు జగన్. ముస్లిం మతపెద్దలు, అర్చకులు అశీర్వాదం అందజేశారు.