Thursday, May 2, 2024
- Advertisement -

బాలయ్య టార్గెట్ మిస్ ఫైర్ అవుతుందా..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ టార్గెట్ మిస్ ఫైర్ అవుతుందా…? నారా లోకేష్ దగ్గరి నుండి బాలకృష్ణ వరకు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఎటు వైపు వెళ్తున్నాయి…?జగన్‌ టార్గెట్ కావాల్సిన టీడీపీ నేతలకు ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ నేతలను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే సమాధానం లేని ప్రశ్నే.

తాజాగా బాలకృష్ణ ఇవాళ పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల కోసం మూడు రోజులుగా కొంతమంది తెలంగాణ నేతలు ఎన్టీఆర్ జపం చేస్తున్నారని….చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని మాట్లాడారు. ఇక ఒక అడుగు ముందుకేసి తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ల లాంటివని చెప్పారు. ఇక తెలంగాణలో టీడీపీ లేదని చెబుతున్న వారికి త్వరలోనే సమాధానం చెబుతామని వెల్లడించారు బాలయ్య.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు ఎక్కడా ఆందోళనలకు దిగిన సందర్భాలు లేవు. కనీసం టీటీడీపీ నేతలు బాబు అరెస్ట్‌ను ఖండించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను ఉద్దేశించి అయినవే అయినా ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్న వారు లేకపోలేదు. ఏదిఏమైనా జరుగుతున్న రాజకీయా పరిణామాలను దగ్గరుండి గమనిస్తున్న వారు మాత్రం బాలయ్య టార్గెట్ మిస్ ఫైర్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -